నమస్తే న్యూస్ : శంకరపట్నం/సెప్టెంబర్/16:
పంచాయతీ రాజ్అధికారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆదేశం ఇటీవలకురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని మాన కొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లినత్యనారాయుణపంచాయతీరాజ్ అధికారులు ఆదేశిం చారు. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో మానకొండూర్ నియోజక వర్గంలో రోడ్ల పరిస్థితితోపాటు వివిధ అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల మాన కొండూర్ నియోజకవర్గం వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల గురించి ఎమ్మెల్యే అధికారుల నుంచి ఆరా తీశారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల విషయమై ప్రభుత్వానికి ఏమైనా ప్రతిపాదనలు పంపారా అని ఆయన సమావేశంలో ప్రశ్నించారు. మండలాల వారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ రహమాన్, డెప్యూటీ ఈఈలు మంజులా భార్గవి, రవి ప్రసాద్, ఏఈలు సురేందర్ రెడ్డి,ప్రవీణ్,మల్లేశం,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










