దివ్యాంగుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు KLR ను కలిసిన దాసర్లపల్లి కాంగ్రెస్ నేతలు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమం: KLR,ఇందిరమ్మ ఇళ్ల మంజూరు. గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీలే ఫైనల్ చేస్తాయని మరోసారి స్పష్టం చేశారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు సరిత మల్లేష్ యాదవ్ కు తొలివిడతలో ఇల్ల మంజూరు చేయాలని

తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయం లో కిచ్చెన్నను కలిసి మార్కెట్ కమిటీ డైరెక్టర్ యుగంధర్ సహా పలువురు విజ్ఞప్తి చేశారు.వెంటనే స్పందిన లక్ష్మారెడ్డి. దివ్యాంగుడుమల్లేష్ యాదవ్ దగ్గరకు వచ్చి ఇల్లు మంజూరు చేసేలా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వ ప్రతినిధులను కోరారు. అర్హత కలిగిన మల్లేష్ ఆర్థిక, స్థితిగతులను విచారించి రంగారెడ్డి జిల్లా హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేశారు.

దీంతో గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, సరితమల్లేష్ కుటుంబసభ్యులు కేఎస్ఆర్ కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, సన్నబియ్యం, ఉచిత బస్సుప్రయాణం సహా ప్రభుత్వ సంక్షేమపథకాలు నిరంతర ప్రక్రియగా అందిస్తామని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.

Latest News