తెలంగాణకు 904టీఎంసీల నీటి వాటాను రాబట్టాల్సిందే ||కృష్ణా జలాల ట్రిబ్యునల్ముందు వాదనలు వినిపించాలి. న్యాయనిపుణులు, అధికారులకు సిఎం రేవంత్ ఆదేశంహైదరాబాద్, సెప్టెంబరు 13: కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ | అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద
జలాలైనాసరే..తెలంగాణాకుచెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కుడావదులుకునేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకు నేందుకు పట్టుబట్టాలన్నారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణా ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై శనివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రెడ్డి సమీక్ష సమావేశం మిగతా2లో…రేవంత్
















