ecis crucial meeting with state ceos on september

బిహార్ లో అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ప్రక్రియపై రాజకీయ పక్షాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులు (సీఈవో)లతో ఈసీ భేటీ కాబోతున్నది. ఇది రెగ్యులర్ మీటింగ్ అని ఈ సమావేశంలో ఎస్ఐఆర్ తో పాటు గత సమావేశాల మాదిరిగానే అన్ని అంశాలపై చర్చించబోతున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.

ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం!:

ఓట్ చోరీ అంశంలో ప్రతిపక్షాలు ఈసీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈసీ- బీజేపీ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను చోరీ చేస్తోందని రాహుల్ గాంధీ నేరుగా ఎటాక్ చేస్తున్నారు. బిహార్ లో ఎస్ఐఆర్ కూడా ఇందులో భాగమేనని వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఈసీ.. బిహార్ లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతోంది. అయితే ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చేపట్టాలని గత జూలైలోనే ఈసీ నిర్ణయం తీసుకుంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన జరగబోయే సమావేశంలో ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.

Latest News